హైదరాబాద్ నిజాంపేట పుష్ఫక్ గృహ సముదాయం వద్ద ఆదివారం నాలాలో పడి బీహార్ వాసి రకిబుల్ షేక్ కొట్టుకుపోయాడు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ ఎంసీ సిబ్బంది అతని ఆచూకి కోసం గాలించారు. కానీ దొరకలేదు. సోమవారం ఉదయం నిజాంపేట చెరువులో రకిబుల్ షేక్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.