బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించి గౌరవించుకునేందు కోసం ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...దసరా కానుకగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆడుపడుచులందరికీ సారే పెడుతుందన్నారు.