న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. హర్యానాలో జరిగే గవర్నర్ల ఉపసంఘం సమావేశంలో తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం గవర్నర్ తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు.