హైదరాబాద్ లోని యూసుఫ్గూడ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. విద్యుత్ మీటర్ బిగించేందుకు ఏఈ సుధాకర్.. ఓ వ్యక్తి నుంచి రూ. 60 వేలు డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా సుధాకర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.