దుండిగల్ లోని ఓ నగల దుకాణంలో చోరీ చేసి పారబోతుండగా పట్టుకునేందుకు యత్నించిన ఎస్సై పైకి కారు ఎక్కిచబోయిన ఘటన సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఎస్సై శేఖర్ రెడ్డికి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే తేరుకున్న పోలీసులు ప్రాణాలకు తెగించి కారును వెంబడించారు. దూలపల్లి ఫారెస్ట్లోకి దొంగలు పరారయ్యారు. దొంగలు ఉపయోగించిన కారు, కట్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఉపయోగించిన కారును అల్వాల్లో చోరీ చేసినట్టు గుర్తించారు. రెండు ఏటీఎంలలో చోరీకి దొంగలు విఫలయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.