ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హుజూర్‌నగర్‌లో ఈసారి కచ్చితంగా గెలుపు టీఆర్‌ఎస్ దే : మంత్రి కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 07:01 PM

 ఐదేళ్ల మూడు నెలల టీఆర్‌ఎస్ పాలనలో నల్గొండకు ఏం చేశామో గమనించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. నల్గొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కాంగ్రెస్ వాళ్లు నామినేషన్ల సమయంలోనే దర్శించుకునేవారని ఎద్దేవా చేశారు. యాదాద్రిని దాదాపు రూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నల్గొండను కాంగ్రెస్ నట్టేట మంచింది అనడం విమర్శ కాదని చెప్పారు. 2004, 2009లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తండాలను పంచాయతీలు చేస్తామన్నారు. కానీ తండాలను పంచాయతీలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కు మాత్రమే దక్కుతుందని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్ ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఈ సారి విజయం తథ్యమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు కృషి చేయాలని, టీఆర్ఎస్ ను గెలిపించి కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com