అమీర్ పేట మెట్రోస్టేషన్ లో చోటు చేసుకున్న దుర్ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే నిపుణులతో విచారణ జరిపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కూకట్ పల్లికి చెందిన మౌనిక ఆదివారం సాయంత్రం వర్షం పడుతుండటంతో మెట్రో స్టేషన్ కిందకు వచ్చింది. 9 మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులూడిపోయి మౌనిక తలపై పడటంతో ఆమె చనిపోయింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం నిపుణులతో విచారణ జరిపించాలని ఆదేశించింది.