కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ విధానాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్కే దుక్కుతుందన్నారు. కేసీఆర్ చర్యల వల్ల పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష రూపాయల భారం పడుతుందన్నారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పగిస్తే.. కేసీఆర్ అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ దుబారా వ్యయాన్ని కాగ్ నివేదిక కూడా తప్పుపట్టిందని రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు ఇంకా అప్పులు చేస్తానంటూ కేసీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని రేవంత్ విరుచుకుపడ్డారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా స్వీకరించాలని టీఆర్ఎస్ పార్టీకి రేవంత్ సవాల్ విసిరారు.