రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు సాగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. సోమవారం సచివాలయంలో 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ఆపిల్ మాక్ బుక్, ఐఫోన్, ఐ పాడ్ లను సీఎస్ జోషి బహుకరించారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, డిప్యూటి సెక్రటరి చిట్టిరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ రోజు వారి కార్యకలాపాల నిర్వహణలో సాంకేతికతను వివియోగించు కోవాలని, కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాలలో అమలవుతున్న 30 రోజుల ప్రణాళిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం పట్ల విస్తృతమైన అవగాహనను కల్పించుకోవాలని అన్నారు.