రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఈరోజు మద్యాహ్నం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గారి ఇంటిలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ఇంటికి భోజనానికి రావాలని స్పీకర్ పోచారం గతంలో ముఖ్యమంత్రి ని ఆహ్వానించారు. స్పీకర్ అధికారిక నివాసానికి విచ్చేసిన కేసీఆర్ దంపతులకు పోచారం కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు జె.సంతోష్ కుమార్ కూడా ముఖ్యమంత్రితో పాటుగా స్పీకర్ నివాసానికి విచ్చేశారు.