టీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన శంకరమ్మ.. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఉప ఎన్నికకూ టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడిని సైదిరెడ్డి పేరునే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు శంకరమ్మను పార్టీలోకి ఆహ్వానించినట్లు, ఆమె హుజూర్నగర్ టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఇక్కడి నుంచి బీజేపీ టికెట్ కోసం నియోజకవర్గానికి చెందని జల్లేపల్లి వెంకటేశ్వర్లు, కోదాడకు చెందిన శ్రీకళారెడ్డి పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ రవీంద్రనాయక్, సీనియర్ న్యాయావాది రామారావు, ముద్ర అగ్రికల్చర్ సొసైటీ చైర్మన్ రామదాసప్పనాయుడు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.