హైదరాబాద్: నగరంలోని తిలక్నగర్ రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు నిర్మాణ పనుల కారణంగా 30 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనీల్ కుమార్ తెలిపారు. ఫీవర్ దవాఖాన వైపు నుంచి తిలక్నగర్, 6 నెంబర్ జంక్షన్లకు ఆర్యూబీ మీదుగా వెళ్లే వాహనాలును శంకర్మఠ్, హిందీ మహావిద్యాల యం, విద్యానగర్ వై జంక్షన్, ఎన్సీసీ జంక్షన్ నుంచి తిలక్నగర్కు వెళ్లాలి. అలాగే 6 జంక్షన్ నుంచి వెళ్లే వాహనాలు శివం రోడ్డు, ఎన్సీసీ, విద్యానగర్ జక్షన్ మీదుగా వెళ్లాలి.