తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు నేతలు డీకే అరుణ, జితేందర్రెడ్డి, మురళీధర్రావులు హాజరయ్యారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి, మున్సిపల్ బిల్లు, గాంధీ జయంతి ఉత్సవాల నిర్వహణ, తదితర అంశాలపై కోర్ కమిటీలో నేతలు చర్చిస్తున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కోర్ కమిటీలో హుజూర్నగర్ అభ్యర్థి ఎంపికపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.