ఆస్థి కోసం తల్లినే చంపబోయాడో ప్రబుద్దుడు. కన్నతల్లి అని కూడా చూడకుండా కడతేర్చేందుకు ప్రయత్నించాడో కిరాతక కొడుకు. ఈ దారుణం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో కలకలం సృష్టించింది. పార్వతీపురం గ్రామంలో కిట్టమ్మ (65)తో ఆమె కొడుకు సూరిబాబు ఉంటున్నారు. మద్యానికి బానిసైన సూరిబాబు తల్లితో ఆస్థి కోసం నిత్యం గొడవపడుతుండేవాడు. ఆస్తిని తన పేరిట రాయాలంటూ బెదిరించే వాడు. ఈ క్రమంలో సోమవారం కూడా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తల్లిపై కోపంతో ఊగిపోయిన సూరిబాబు.. డబ్బు కోసం జన్మనిచ్చిన తల్లిపై దాడికి తెగబడ్డాడు. బీరు సీసాను పగులగొట్టి గొంతులో పొడిచాడు. గొంతులో పొడవడంతో కిట్టమ్మకు తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు ఆమెను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని.. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. తల్లిపై దాడి చేసిన అనంతరం సూరిబాబు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.