ఇండియాలో ఉగ్రదాడులు చెయ్యాలనుకుంటే... ఉగ్రవాదులు ముందుగా ఎంచుకుంటున్న నగరం హైదరాబాద్. ఇదివరకు చాలాసార్లు అలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా మరోసారి హింసకు పాల్పడే లక్ష్యంతో హైదరాబాద్లో అడుగుపెట్టిన ఉగ్రవాదుల్ని ఆర్మీ అధికారులు పట్టుకున్నారు. ఇంకా చాలా మంది స్లీపర్ సెల్స్లా ఉండి ఉండొచ్చన్న అనుమానంతో... అళ్వాల్, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నా్రు. ఇటీవల జమ్మూకాశ్మీర్లో చొరబాట్లు పెరిగాయి. ఇదే విషయాన్ని నిన్న ఆర్మీ చీఫ్ కూడా స్పష్టం చేశారు. ఇండియాతో డైరెక్టుగా తలపడేంత సీన్ లేని పాకిస్థాన్... ఉగ్రదాడులు చేయించేందుకు కుట్రలు పన్నుతోంది. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం... భారత ప్రభుత్వ చర్యల వల్ల సరిహద్దుల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయే ప్రమాదం ఉందంటూ... పిచ్చి ప్రేలాపనలు చేశారు. తద్వారా... పరోక్షంగా ఉగ్రవాదులకు సంకేతాలిచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు తగ్గట్టే... ఇండియాలో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే శ్రీహరి కోట లక్ష్యంగా సముద్ర మార్గంలో ఉగ్రవాదులు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అక్కడ సైన్యం అప్రమత్తం అయ్యేసరికి... ఉగ్రవాదులు వేరే మార్గాలు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో టెర్రరిస్టుల కలకలం రేగుతోంది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి.