వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్తను ఇరుగుపొరుగు మహిళల సహకారంతో భార్య చితక బాదిన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... వరంగల్ పట్టణంలోని శివనగర్లో మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ వేరే మహిళతో సహజీవనం చేస్తున్న ముత్తోజు రవికి తగిన బుద్ధి చెప్పాలని అతని భార్య సరిత నిశ్చయించుకుంది. రవి ప్రియురాలితో కలిసి ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఆమెతోపాటు తోటి మహిళలు కూడా రవికి, అతనితోపాటు సదరు మహిళను చితకబాదారు. రవి, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.