సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామ శివారులో మంగళవారం హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వెళ్తున్న బొలెరో వాహనం రోడ్డు పై పనులు చేస్తున్న కార్మికులను ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.