నగరంలోని కొత్తపేట పండ్ల మార్కెట్లో రైతులపై దళారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. రైతులపై దాడిని ఆయన తీవ్రంగా పరిగణించారు. మార్కెటింగ్ శాఖ సంచాలకుడికి మంత్రి ఫోన్ చేసి, వారిపై చర్యలు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దళారులు రైతులను పీడించడం తగదని, వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలిపారు. సంబంధిత వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలనీ, దాడి చేసిన వారి లైసెన్సులు రద్దు చేయాలని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. మార్కెట్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనీ, స్థానిక అధికారులు నిరంతరం మార్కెట్లో పర్యవేక్షించాలని ఆయన అన్నారు.