హైదరాబాద్: త్వరలో జరగబోయే హుజూర్నగర్ అసెంబ్లి ఉప ఎన్నికల ఇంఛార్జ్గా పల్లా రాజేశ్వర్రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లాను హుజూర్నగర్ ఉప ఎన్నికల ఇంఛార్జ్గా నియమించారు. ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ పల్లాకు ఆదేశించారు. పార్టీ నాయకులంతా మున్సిపాలిటీ వారీగా బాధ్యతలు తీసుకుని పార్టీ యంత్రాంగాన్ని సమన్వయ పర్చాలని సూచించారు.