కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు చింతల్లోని కెఎంజి గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ , జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు , కొలుకుల జగన్ , విజయ్ శేఖర్ గౌడ్ , మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు రఫీ , దేవగారి రాజేందర్ రెడ్డి , కేఎం గౌరీష్ ముఖ్య అతిథులుగా పాల్గొని బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.