ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము ఎలా జోక్యం చేసుకోవాలో తెలపాలని పిటిషనర్ ను హైకోర్టు కోరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా ఉందా, చట్టవ్యతిరేకంగా ఉందా అనేది తెలపాలని పిటిషనర్ ను ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈనెల 21 కి వాయిదా వేసింది. ఇవ్వాళ సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. సచివాలయంలోని పాత భవనాలపై టెక్నికల్ రిపోర్టు ను ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు కు సమర్పించారు. సచివాలయంలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరాయని తెలిపారు. అందుకే కొత్త సచివాలయం నిర్మిస్తున్నామని విన్నవించారు. కాగా ఏడేళ్ల క్రితం నిర్మించిన హెచ్ బ్లాక్ ను కూడా ఎందుకు కూల్చివేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నిచారు. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటెగ్రేటెడ్ సెక్రటేరియట్ నిర్మిస్తున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు.