దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. గురువారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ సూచీలు మినహా మిగిలిన సూచీలన్నీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 453 పాయింట్లు పెరిగి 39,052కి ఎగబాకింది. నిఫ్టీ 118 పాయింట్లు లాభపడి 11,582కు చేరుకుంది.