Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు
ప్రశ్న: టిటిడి పాలక మండలిలో సభ్యులు సంఖ్యని పెంచిన ప్రభుత్వం వాటి నియామకాలపైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంఉందన్నది నా అభిప్రాయం. ఇప్పటికే అన్యమతస్తులని నియమిస్తోందన్న అపప్రదని ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలని అంటాను. మీరేమంటారు?
- సుధా సుబ్రహ్మణ్యం, చెన్నై
జవాబు: మీరన్నది నిజమే సుధాగారూ... ఇప్పటికే అన్యమత ప్రచారంపై టిటిడితో పాటు ఏపిలోని పలు దేవాలయాలలో చర్చలు తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఉద్యోగులను సైతం వేర్వేరు శాఖలకు పంపించడం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక టిటిడి పాలకమండలి వ్యవహారంలోకూడా హిందుత్వం తొణికసలాడే నిర్ణయంఆలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికి వినిపిస్తున్న పేర్లు ఓ సారి పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది. ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి 28మందికి అవకాశం కల్పించింది.. ఈ మేరకు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి 8మంది.. తెలంగాణ 7గురు.. తమిళనాడు నుంచి 4.. కర్ణాటక నుంచి 3.. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒకరి చొప్పున పాలకమండలిలిలో అవకాశం కల్పించారని. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఏపీ నుంచి పాలకమండలి సభ్యులు గా పార్థసారధి (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే) , గొల్ల బాబూరావు (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే) , డీ మల్లికార్జునరెడ్డి (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే) , యూవీ రమణమూర్తి (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే) , డీపీ అనంత , నాదెండ్ల సుబ్బారావు, చిప్పగిరి ప్రసాద్ కుమార్ , వీ ప్రశాంతి
తెలంగాణ నుంచి జె.రామేశ్వరరావు . బి పార్థసారధి రెడ్డి .వెంకట భాస్కర్రావు .మూరంశెట్టి రాముల .డి. దామోదర్ రావు .కే శివకుమార్ .పుట్టా ప్రతాప్రెడ్డిలు ఉన్నారు. ఇక పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి వైద్యనాథన్, శ్రీనివాసన్, డాక్టర్ నిశిత, కుమారగురుకు అవకాశం కల్పించారు. కర్ణాటక నుంచి రమేష్ శెట్టి, రవినారాయణ, నారాయణమూర్తిలకు స్థానం దక్కింది. ఢిల్లీకి చెందిన శివశంకరన్.. మహారాష్ట్రకు చెందిన రాజేష్ శర్మకు ప్రభుత్వం పాలకమండలిలో అవకాశం కల్పించిందని సమాచారం.