Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు
ప్రశ్న: సింగరేణి కార్మికులకు ప్రతి ఏడూ అందుకున్న విధంగా సంస్థ లాభాల్లో వాటాలను కార్మికులకు కూడా పంచడం హర్షణీయమే. ఈ సారి కూడా సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. ఈ తరహాలో లాభార్జనదిశగా ఉన్న సంస్ధలు కూడా ముందుకెళితే బాగుండేది కదా? మీరేమంటారు?
-నాగవరపు సుబ్రహ్మణ్యం, హన్మకొండ, వరంగల్
జవాబు: నిజమే... మీరన్నది సుబ్రహ్మణ్యం గారూ... కానీ సింగరేణి ప్రభుత్వ రంగ సంస్ధ కనుకనే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ లాభాల్లో 28 శాతం బోనస్ అందజేసేందుకు ముందుకొచ్చింది. . సింగరేణిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయటం వల్లే ఆ సంస్ధ లాభాల బాటలో నడుస్తోందన్నది వాస్తవం. కార్మికులు శ్రమించడం వల్లే ఏటా బొగ్గు ఉత్పత్తి పెరుగుతోందన్నదీ నిజం ఈ క్రమంలోనే సింగరేణిలో లాభాలు పెరుగుతున్నాయని.. అలాగే లాభాల్లో కార్మికులకు వాటా పెంచుతామంటూ గతంలో చెప్పిన సిఎం కేసీఆర్ అనుకున్నట్టే ఈ ఏడాది 28 శాతం వాటా ఇస్తామన్నారు. దీంతో ప్రతి కార్మికుడికి రూ.1,00,899 బోనస్ అందనుంది. గత ఏడాది కంటే రూ.40,300 అధికంగా బోనస్ ఇస్తుండటం విశేషం. 2016లో రూ.54 వేలు, 2017లో రూ. 57 వేలు బోనస్గా ఇచ్చారు. శాలరీ అడ్వాన్స్లకు ఇది అదనం అని చెప్పాలి.
ఇక మిగిలిన సంస్ధలలో లాభాల బాట పట్టినవి చాలా తక్కువ. ప్రయివేటు కంపెనీలైనా ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు మక్కువ చూపుతాయి కానీ ప్రభుత్వ పరిశ్నమలు, ఇతర సంస్ధలు లాభాలకన్నా వచ్చే నష్టాలు ఇప్పటి నుంచే తట్టుకోవలనుకుంటాయి కనుక ఇంత భారీ స్ధాయిలో బోనస్లు ప్రకటించవన్నది నా అభిప్రాయం.