తెలంగాణలో ఆర్టీసి సమ్మె కొనసాగుతూనే ఉంది. సర్కార్ నిర్ణయంతో ఆందోళన చెందిన మరో డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ముషిరాబాద్ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ సోమవారం గుండెపోటుతో మలక్ పేటలోని యశోద ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ బధవారం మరణించాడు. రమేష్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్. 17 రోజులుగా ఆర్టీసి సమ్మెలో రమేష్ కీలకంగా పాల్గొన్నాడు. సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగం పోతుందని రమేష్ బాదపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రమేష్ మరణానికి తెలంగాణ సర్కారే కారణమని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు.