Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు
ప్రశ్న: ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ప్రశ్న: ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకు విలీనాన్ని పలు సంస్థలు గట్టి వ్యతిరేకిస్తున్నాయి. బిజెపికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. బ్యాంకు విలీనం హడావుడిగా చేపట్టారని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం?
డి. కిరణ్, రాజమండ్రి
జవాబు: ప్రభుత్వ రంగ సంస్థ విలీనంపై 1990 దశకంలో ఏర్పాటు చేసిన నరసింహన్ కమిటీ నివేదిక పు సిఫార్సు చేసింది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థను కలిపి నాలుగు, లేదా ఐదు పెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేసినట్లయితే, ఆ బ్యాంకు మూధనం పెరుగుతుందని, నిర్వహణ వ్యయం తగ్గుతుందని, ఫలితంగా అవి అంతర్జాతీయ బ్యాంకుతో పోటీ పడే సామర్థ్యానికి చేరుకుంటాయని కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు ఆధారంగా ఎస్బిఐలో దాని అనుబంధ బ్యాంకులను విలీనం చేశారు. 1992 నుంచి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణను వరసగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల విలీనాల ప్రక్రియను చేపట్టింది.