హైదరాబాద్ లోని మహంకాళీ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ జ్యువెలరీ షాపులోకి చొరబడ్డ దొంగలు రూ. 30 లక్షల నగదును అపహరించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నవెూదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీకి సంబంధించి 8 మంది అనుమానితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చోరీ చేసి పరారైన దుండగుల దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో నవెూదు అయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దుండగులు బైక్ పై కలాసిగూడ విూదుగా వెళ్లినట్లు చెబుతున్నారు. పదిహేను రోజుల క్రితం హయత్నగర్లో దోపిడీ చేసిన ముఠానే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.