భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థపై జరిగిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.. ఈ సంస్థలోని వివిధ అంశాలపై సమీక్షించారు.. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు , మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత , జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరం కనకయ్య , మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ రజిత్ కుమార్ శైనీ, ఐటిడిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు…