నిర్మల్ జిల్లాలోని రైతులు పడుతున్న కష్టాలకు చలించి వారి కష్టాలను కొంచమైనా తీర్చాలనే ఉద్దేశ్యంతో రైతుల ప్రయోజనాల కోసం రైతుయంత్ర యాప్ను తయారు చేసి దేశంలోనే మంచి గుర్తింపు సాధించి జాతీయ స్థాయిలో రాజ్యసభ సభ్యులు, మాజీ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చేతుల మీదుగా అవార్డు పొందిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని టీఎన్జీవో సంఘ భవనంలో జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ భాస్కర్రావులను ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో ఉద్యోగులు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సుభాష్రావు, రైతునాయకులు ఘనంగా పూలమాలలు, శాలువలతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం జి ల్లా కలెక్టర్ నేతృత్వంలో చేపట్టిన రైతుయంత్ర యాప్కు జాతీయస్థాయిలో అవార్డు రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కూడల రవికుమార్, అర్బన్ అధ్యక్షులు మెంగా ప్రవీణ్, రూరల్ అధ్యక్షులు బి.సుజయ్, అర్బన్సెక్రటరి చక్కరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ధర్మానం ద్గౌడ్, మోహన్రెడ్డి, ఎం.శ్రీనివాస్, స్రవంతి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నర్సయ్య, పి.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.