హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) ఏ-3 డివిజన్ వన్డే లీగ్లో రంగారెడ్డి జట్టు, హైదరాబాద్పై గెలుపొందింది. బుధవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి చేతిలో హైదరాబాద్ రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్ను కూడా చేరుకోలేకపోయారు. దీంతో 26.1 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది.రంగారెడ్డి బౌలర్ పవన్ కల్యాణ్ 5 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్ ధన్రాజ్ (7/38) విజృంభించడంతో స్వల్ప లక్ష్య ఛేదనలోనూ రంగారెడ్డి తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓ దశలో ఓటమి అంచుల వరకు వెళ్లింది. అయితే పదో స్థానంలో వచ్చిన కిరీటి (39 నాటౌట్ 6 ఫోర్లు, 2,సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించడంతో రంగారెడ్డి జట్టు 19.2 ఓవర్లలో 109 పరుగులు చేసి గెలిచింది.