Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు
ప్రశ్న : తెలంగాణలోని యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని పులు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. యురేనియం ఎంతో విలువైన ఖనిజం. దీన్ని వెలికితీస్తే, ఎంతో విలువైన విదేశీ ఆదాయం మిగుతుంది కదా?
కె. ప్రసాద్, రామచంద్రపురం
జవాబు : మీ చెప్పింది నిజమే. యురేనియం ఎంతో విలువైన ఖనిజం. దీనిని అణుశక్తి కర్మాగారాల్లో విద్యుత్ను తయారు చేసేందుకు, దేశ రక్షణ కోసం అణుబాంబును తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే, యురేనియం భూమి లోపల ఉన్నంత వరకు దాని వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కాని దాన్ని వెలికితీస్తే, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ప్రాణాధారమైన జలం కూడా పూర్తిగా కలుషితం అవుతుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో నల్లమల కొండలు పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతం. ఇది ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించింది. అంతే కాకుండా ఇక్కడే శ్రీశైం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద పు సంరక్షణ కేంద్రం కూడా రెండు రాష్ట్రాల్లో విస్తరించింది. రెండు రాష్ట్రాకు కృష్ణానది అత్యంత ముఖ్యమైన జలవనరు. ఇది న్లనల్లమల కొండలుమీదుగా ప్రయాణం చేస్తుంది. యురేనియం తవ్వకాలు చేపట్టిడితే, ఈ ప్రాంతమంతా కలుషితమవుతుందని పర్యావరణవేత్త, ప్రజలు, పలు రాజకీయ పక్షా ఆందోళన. కనుక ప్రభుత్వం పర్యావరణానికి హాని కులగ కుండా యురేనియం తవ్వకాలు చేపడితే ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు అవుతుంది.