హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీ శబ్ధంతో పేలుడు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు ధాటికి ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి. SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.