ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ రెండో రాజధాని, కామన్ సివిల్ కోడ్‌పై చర్చించలేదు: కిషన్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2019, 06:47 PM

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని అంశం కానీ కామన్ సివిల్ కోడ్ పై ఎటువంటి చర్చలు జరగలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కేంద్రం ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించలేదన్నారు. అలాగే బిజెపిలోనూ అంతర్గత చర్చ జరగలేదన్నారు. హైదరాబాద్‌ను రెం డవ రాజధానిగా కేంద్రం చేయాలని భావిస్తున్న ది కేవలం అసత్య ప్రచారం మాత్రమేనని ఆ యన తెలిపారు. దేశంలో పెరిగిపోతున్న అవినీ తి, ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ఎంత దూరమైన పోతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో కేం ద్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడపోదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధానిగా నరేంద్రమోడీ పగ్గాలు చేపట్టి సుమారు ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అవినీతి మరక అంటలేదన్నారు.
ఇది మోడీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమమన్నారు. అలాగే ఉగ్రవాదులు భారత్‌వైపు చూసిన ప్రతి సందర్భంలోనూ మన సైనికులు దానిని సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏ ప్రశ్నలు అడిగినా నిర్మాణాత్మక సమాధానాలు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ముందుంది ప్రతి ఇంటికి పరిశుభ్రత నీరు, గ్యాసు, విద్యుత్తు కనెక్షన్, టాయిలెట్ నిత్యవసర సరుకుల పంపిణీ, వైద్య సహాయం, రైతుకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆర్‌టిసి కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకొని పరిష్కార మార్గాలు వెతకాలని కిషన్ రెడ్డి అన్నారు. ఆర్‌టిసి ఆస్తుల పంపకాలు ఇద్దరు సిఎంలు కలిసి కూర్చొని పరిష్కరించకుంటే కేంద్రం కూడా స్వాగతిస్తుందన్నారు. ఇతర అంశాల్లో కలసి డిన్నర్లు చేసే సిఎంలు ఈ సమస్య పరిష్కరించడంలో కూడా చొరవ చూపాలని కిషన్ రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ రాష్ట్రం అయినందుకే కాలేశ్వరం ప్రాజెక్టును చేపట్టామన్న కెసిఆర్, ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా కేంద్రంపైన నిందలు వేయడం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని కిషన్ రెడ్డి అన్నారు. ఎపి పునర్విభజన చట్టం ప్రకారం కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని విభజన సమయంలో పార్లమెంట్ లో ఉన్న కెసిఆర్ అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని ఇప్పటికే తెలంగాణలో 11 నిలిచిపోయిన ప్రాజెక్టులను కేంద్రం నిధులు ఇచ్చి పూర్తి చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com