మాంసాహార ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో చికెన్ వినియోగం అధికంగా పెరిగింది. దీంతో చికెన్ ధరలు మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ కిలో కెన్దర 150 నుం 160 రూపాయలు పలికింది. కానీ గత రెండురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ ధరలు కేజీ 210 రూపాయలు పలికింది. మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా నవంబర్ నుంచి డిసెంబర్మధ్య చికెన్ ధరులు తక్కువగానే ఉంటాయి. అక్టోబరు నెలలోనే చికెన్ ధరలు గరిష్టంగా కేజీకి 280 రూపాయల వరకు పలికింది. దసరా సమయంలో ఇలాంటిపరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. నవంబరు, డిసెంబరులో కార్తీకమాసం, అయ్యప్పపూజల కారణంగా మాంసాహారం తినేవారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. దీంతో ధరలు తగ్గుతుంటాయి. కానీ ప్రస్తుతం నవంబరులోనే కిలో 210 రూపాయలకు చేరితే సంక్రాంతి నాటికి ధరలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.