తక్షణమే ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చించాలని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి అన్నారు. అఖిలపక్ష నేతలతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన అనంతరం చాడ మాట్లాడారు.ప్రభుత్వంతో మాట్లాడాలని గవర్నర్ను కోరామన్నారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. ఆర్టీసీ ఎండీ, హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ దారుణమన్నారు.