కాకతీయ యూనివర్సిటీలో 38 మంది అధ్యాపకుల తొలగింపు వివాదం ముదురుతుంది. తమను తొలగించడం అన్యాయమని బాధితులు నిరసన తెలుపుతుంటే.. మరో అధ్యాపక బృందం వారిని తప్పు పడుతోంది. పాలక వర్గం తీసుకున్న నిర్ణయం సమంజసమైనదేనని చెబుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ల తొలగింపు వివాదం రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. 38 మంది కూడా అక్రమంగా విధుల్లోకి చొరబడ్డారని మరో వర్గం ఆరోపిస్తోంది.
అయితే ప్రభుత్వం తాజాగా కొత్త పాలక వర్గాన్ని నియమించటంతో.. వారిని కొత్త పాలక వర్గం నుంచి తొలగించడం జరిగింది. అలా తొలగించిన రోజు నుంచి ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉన్నారు. అప్పటివరకు ఈ ప్రొఫెసర్లను పొగిడిన వాదంతా.. వాళ్ళ తొలగింపుపై పాలకవర్గం తీసుకున్న నిర్ణయం సక్రమమే అంటున్నారు. ఆ ప్లేస్ లో వేరే ఎలిజిబుల్ క్యాండెట్స్ కు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. మొత్తంగా కాకతీయ యూనివర్సిటీలో ఆధ్యాపకుల తొలగింపు విషయంలో జరుగుతున్న వివాదం చివరకు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.