భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగరడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిన నీరో చక్రవర్తి కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు ఫాంహౌస్ పాలేర్లుగా ఉన్నారన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ పెడతామని లక్ష్మణ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ అన్నారు.