ఆర్టీసీ ఆస్తులను కాజేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. .. కార్మికుల సమ్మెను నిర్లక్ష్యం చేస్తూ, కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల్లోనే తప్పుడు నివేదికలు ఇచ్చిన ఉన్నతాధికారులు.. లేబర్ కోర్టులో నిజాలను చెబుతారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఆస్తులు పెరిగాయి కానీ నష్టాలు ఎప్పుడూ రాలేదన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే అన్నారు.