తెలంగాణ కాబినెట్ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేటాయింపులపై చర్చించనున్నారు. లోకాయుక్త చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ పై చర్చించనున్నారు. మేడ్చల్ చెంగిచెర్లలో లాలూ గ్రూప్ నకు లీజుకి బు కేటాయింపు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నాబార్డ్ నుంచి రూ. 1500 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 14075 కోట్ల రుణానికి ఆమోదం తెలపనున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి మధ్య మానేరుకు అదనంగా 1.1 టీఎంసీల నీటి ఎత్తిపోత పనులకు ఆమోదం తెలపనున్నారు.