హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగించింది. దాదాాపు అన్ని మున్సిపాల్టీలను కైవసం చేసుకొని తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ మారింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీలలో గెలిచిన వివరాలు ఇలా ఉన్నాయి. బడంగ్ పేట్, మీర్ పేట, బండ్లగూడ జాగీర్,బోడుప్పల్, ఫీర్జాదీగూడ,జవహర్ నగర్,నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లు టీఆర్ఎస్ కైవసమయ్యాయి. ఇబ్రహీంపట్నం, నార్సింగ్, మేడ్చల్,దమ్మాయిగూడ, షాద్ నగర్, శంషాబాద్ ,తుర్కయంజాల్,మణికొండ,నార్సింగ్ ,ఘట్ కేసర్,పోచారం,గుండ్ల పోచంపల్లి మున్సిపాల్టీలు టీఆర్ఎస్ వశమయ్యాయి. పెద్ద అంబర్ పేట, ఆదిభట్ల మున్సిపాల్టీలు కాంగ్రెస్ వశమయ్యాయి.