పురపాలక ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం – పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు. పార్టీకి ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు దక్కిన ప్రజల ఆమోదం ఇది
ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరిస్తునే ఉన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను కాక ప్రభుత్వం చేసిన మంచి పనులకి ప్రజలు ఓటేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో అయిన ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నా. పార్టీ విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, సోషల్ మీడియా వారియర్స్ కి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ . రానున్న నాలుగు సంవత్సరాల్లో ఏలాంటి ఎన్నికలు లేనందున పాలనపై నే పూర్తి దృష్టి అన్న కేటీఆర్
ప్రజాసంక్షేమానికి, అభివృద్ధికి పునరంకితం అవుతామన్న కేటీఆర్. పురపాలక ఎన్నికలలో ఘన విజయం అందించిన తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి సాధించే ఏ విజయమైన తెలంగాణ ప్రజల విజయమెనని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నిక ఏదైనా టిఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని మరోసారి నిరూపించారన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు గత ఐదున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కు ప్రజల నుంచి లభించిన ఆమోదమన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి హడావుడి లేకుండా తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి ఆశీర్వాదం అడిగామని, ప్రజలు తమ పార్టీకి మద్దతు ఇచ్చారన్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారనీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో ప్రతిపక్షానికి ప్రజలు బుద్ధి చెబుతూనే ఉన్నారని , ఈ ఫలితాలతో నైనా ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
పురపాలక ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీకి ఉన్న 60 లక్షల సభ్యుల బలం వారి కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు. కేంద్ర కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసిన ఎన్నికల సమన్వయ కమిటీకి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించడంతో పాటు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టిన సోషల్ మీడియా సైనికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికల్లో, ప్రజలు పార్టీకి ఘనవిజయం కట్టబెడుతు, మాపైన బాధ్యత పెంచారన్న కేటీఆర్, ఇక రానున్న నాలుగు సంవత్సరాలపాటు ఏలాంటి ఎన్నికలు లేవని, పరిపాలన పైన పూర్తి దృష్టి సారించి, ప్రజల సంక్షేమానికి పునరంకితం అవుతామని తెలిపారు.