తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ నడిచి టీఆర్ఎస్ విజయదుందుంభి మోగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు,నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ప్రజలు మరోసారి నిరూపించారని, ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఎక్కడికక్కడ ఫుల్ జోష్ లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.