ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన తో కలిసి తెలంగాణలో పనిచేస్తాం : బిజెపి నేత లక్ష్మణ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2020, 07:30 PM

తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేయడానికి బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఓ ప్రకటన చేశారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంలో తాము జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.


మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మెజారిటీ రాని స్థానాల్లో కూడా ఆ పార్టీ దొడ్డి దారిన ఛైర్మన్ పదవులను దక్కించుకోవాలనుకుంటోందని ఆరోపించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల పట్ల టీఆర్ఎస్ వైఖరి ఆక్షేపణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేకేను తెలంగాణలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com