తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సిందిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఆహ్వానించారు. సోమవారం రాజ్భవన్కు వచ్చిన ఆమె గవర్నర్కు ఆహ్వానపత్రాన్నిఅందజేశారు. ఈసందర్భంగా గవర్నర్ సమ్మక్క సారలమ్మ జాతర గురించి కూడా ఆమెను అడిగి తె లుసుకున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది.