ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహకార ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేత దారుణ హత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2020, 08:43 AM

హత్యా రాజకీయాలకు పెట్టంది పేరైన సూర్యాపేట జిల్లాలో సహకార ఎన్నికల వేళ మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. ఈ గొడవల్లో టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు. సూర్యాపేట గ్రామీణ మండలం యార్కారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ మాజీ సర్పంచి, టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు శుక్రవారం అర్ధరాత్రి దారుణంగా హత్యచేశారు. సహకార సంఘ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలతో మాట్లాడుతున్న వెంకన్నపై ప్రత్యర్థులు దాడిచేశారు. తల్వార్లు, గొడ్డళ్లతో ఆయనను వెంబడించారు.


ప్రాణభయంతో పరుగులు పెట్టిన వెంకన్న ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నా ఆయన ప్రాణం దక్కలేదు. నిందితులు తలుపులు పగులగొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. దీంతో యార్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సహకార ఎన్నికల విషయమై యార్కారం గ్రామంలో గత రెండు రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలే వెంకన్నను హత్య చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హత్య గురించి సమాచారం అందుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.


వెంకన్న హత్యతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, వెంకన్న హత్యతో గ్రామంలో ఫ్యాక్షన్ హత్యలు మరోసారి మొదలయ్యాయి. పదిహేనేళ్ల కిందట ఇదే విధంగా గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్‌ను హత్య చేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com