బీజేపీ ద్వారా జరుగుతున్న కుట్ర ప్రమాదకరమైందని భట్టి విక్రమార్క అంటున్నారు. మేము భారతీయులమే అని జెండా పట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని అయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనవర్గాల ప్రజలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అయన తెలిపారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కేంద్రం రిజర్వేషన్లను తొలగించే కుట్ర చేస్తోందని షబ్బీర్ అలీ అన్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేసీఆర్ మొదటి శత్రువు అని అయన అన్నారు. రిజర్వేషన్లపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అని అయన ప్రశ్నించారు.