నారాయణ, శ్రీచైతన్య కాలేజీల వ్యవహారంపై హైకోర్టులో విచారణ చేపట్టారు. ఇంటర్ బోర్డు నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై హైకోర్టుకు విచారణ నివేదిక సమర్పించింది. సుమారు 45 కాలేజీలు నిబంధనలు పాటించడంలేదని బోర్డు తెలిపింది. ఈ కాలేజీల్లో 20వేల మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించింది. గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. విద్యార్థులతో చెలగాటం ఆడొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో 25 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.