వనదుర్గ మాతకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరిశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి ,మదన్రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి,ఈఓ సారా శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. సమైక్య రాష్ట్రంలో అన్నింటికీ అన్యాయం జరిగినట్టుగానే దేవాలయాలకు అన్యాయం జరిగిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో అన్నింటికీ అన్యాయం జరిగినట్టుగానే దేవాలయాలకు అన్యాయం జరిగిందని అన్నారు.వచ్చే శివరాత్రి నాటికి కాళేశ్వరం నీళ్లు మెదక్ జిల్లాకు వస్తాయని అన్నారు.సీఎం కేసీఆర్ కాళేశ్వరం పనులను యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారని వివరించారు.ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్ల ద్వారా రెండు పంటలు పండిస్తామని హరీశ్ రావు అన్నారు.సీఎం కేసీఆర్ రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.