అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో మూడు రోజుల్లో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... అమెరికా వీసాలు, గ్రీన్కార్డులు తదితర అంశాల విషయంలో ట్రంప్ వైఖరిపై ఎప్పటికప్పడు ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇక విషయానికొస్తే... ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు క్యూ కడుతున్నారు. విదేశాలకు వెళ్లదలచుకున్న భక్తులు ఇండియాలో ట్రంప్ పర్యటన సందర్భంగా ఇక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హెచ్1బీ వీసాల సంఖ్యను కుదించాలన్న ట్రంప్ ఆలోచనా ధోరణిని, భారతీయుల పట్ల ట్రంప్ అభిప్రాయాన్ని మార్చాలని వేడుకున్నారు.
చిలుకూరు బాలాజీకి వీసా బాలాజీగా పేరున్న విషయం తెలిసిందే. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళే యత్నాల్లో ఉన్నవారు... చిలుకూరు బాలాజీ దేవాలయంలో పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి, స్వామి వారిని దర్శించుకుంటే వీసాలు వస్తాయనన్న విశ్వాసం ప్రజల్లో ఉంది.