ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిటీ లో 24న పలుప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 08:33 AM

గ్రేటర్‌ దాహార్తిలో కీలకమైన కృష్ణా ఫేజ్‌-1 జలాల తరలింపులో అంతరాయం ఏర్పడింది. కృష్ణా ఫేజ్‌-1 2200, 1200 డయా ఎంఎస్‌ పైపులైన్‌ పలుచోట్ల లీకేజీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పైపులైన్‌ లీకేజీలను అరికట్టేందుకుగానూ ఈ నెల 24 (సోమవారం) ఆరు గంటల నుంచి 25వ తేదీ ఉదయం ఆరుగంటల వరకు ఈ మరమ్మతు పనుల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. 24 గంటల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. మిరా లం, కృష్ణబాగ్‌, బాల్‌ శెట్టిఖేత్‌, అలీబైల్‌ కాలనీ, అలీయాబాద్‌, హాషంబాద్‌, రియాసత్‌ నగర్‌, సంతోష్‌నగర్‌, వినయ్‌నగర్‌, సైదాబాద్‌, అస్మాన్‌ఘాడ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మెహబూబ్‌ మాన్షన్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, హిందీనగర్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివం, చిలకలగూడ, హైదర్‌గూడ రిజర్వాయర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఈ స్వల్ప అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com